పేజీలు

23, డిసెంబర్ 2015, బుధవారం

కంటి పరీక్ష పత్రము

       దృష్టి తీక్షణత పరీక్షించటానికి ఉపయోగించే పత్రం. దీనిని మనిషి దూర చూపు లోపాలు తెలుసుకోవటం కోసం కంటి వైద్యులు ఉపయోగిస్తారు. ఈ పత్రంలో అక్షరాలు లేదా అంకెలు లేదా చిహ్నాలు అనేక వరుసలు, పరిమాణాలలో ఉంటాయి. ఒక్కో వరుస ఒక్కో పరిమాణంలో ఉంటుంది. పత్రం కిందికి వెళ్ళేకొద్ది అక్షర పరిమాణం తగ్గుతుంది. ప్రపంచంలో ఎక్కువగా వాడే పత్రం - స్నెల్లెన్ పత్రము. హెర్మన్ స్నెల్లెన్ అనే నెథెర్లాండుకి  చెందిన కంటి వైద్యుడు 1892 లో రూపుదిద్దాడు.
 
 



(ఈ చిత్రం వికీపీడియా నుండి సేకరించబడినది)
 
        మనం స్నెల్లెన్ పత్రంలో, 20/20 అని సూచించబడిన వరుస తీసుకుంటే, లవములో ఉన్న అంకె మనిషి దూరాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడూ 20నే ఉంటుంది. అంటే,  పరీక్షించబడే మనిషి ఎప్పుడూ 20 అడుగుల దూరంలో ఉండాలి.  హారంలో ఉన్న అంకె ఎంత దూరం నుండి ఆ వరుస చక్కగా కనిపిస్తుందో  సూచిస్తుంది. అంటే, ఈ వరుస 20 అడుగుల నుండి చక్కగా కనిపించాలి.  20/200 చూపు తీక్షణత ఉన్న మనిషి ఆమెరికా చట్టరిత్యా అంధుడిగా పరిగణించబడతాడు.

12, ఏప్రిల్ 2014, శనివారం

తెలుగు వర్ణములు


అచ్చులు

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ అః


హల్లులు

- క వర్గము

చ ౘ జ ౙ - చ వర్గము

ణ - ట వర్గము

న - త వర్గము

మ - ప వర్గము

య ర ఱ ల ళ వ స హ క్ష


అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ - హ్రస్వములు - రెప్పపాటు కాలములో పలికెడివి

ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ - దీర్ఘములు - సాగదీసి పలికెడివి

ఎ, ఏ, ఒ, ఓ - వక్రములు - వంకరగా ఉండెడివి  

ఎ, ఒ - హ్రస్వవక్రములు - రెప్పపాటు కాలములో పలికెడివి, వంకరగా ఉండెడివి  

ఐ, ఔ - వక్రతమములు - బాగా వంకరగా ఉండెడివి

అం, అఁ, అః - ఉభయాక్షరములు - అచ్చులలోను, హల్లులలోను పరిగణించబడెడివి 

అం * - సున్న, నిండుసున్న, పూర్ణబిందువు, పూర్ణానుస్వారము 

అఁ * - అఱసున్న, అర్ధసున్న, అర్థబిందువు, ఖండబిందువు

అః * - విసర్గ - విడవబడెడిది

క, చ, ౘ, ట, త, ప - పరుషములు

గ, జ, ౙ, డ, ద, బ - సరళములు

ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష - స్థిరములు - వ్యాకరణ కార్యములలో మారనట్టివి 
 
క నుండి మ వరకు  - స్పర్శములు

య, ర, ఱ, ల, ళ, వ - అంతస్థములు - స్పర్శములకు ఊష్మములకు మధ్య ఉండెడివి  

శ, ష, స, హ - ఊష్మములు - ఊది పలికెడివి


_ తో సూచించబడిన వర్ణములు సంస్కృతమునుండి తెలుగు లోనికి వచ్చినవి.
* సున్న, అఱసున్న, విసర్గ విడిగా వ్రాయడం కుదరక 'అ' తో కలిపి వ్రాయడం జరిగినదని గమనించగలరు
  

20, మార్చి 2014, గురువారం

యకారము, వు, వూ, వొ, వో అనే అక్షరములు తెలుగు పదములకు మొదట లేవు

        మన భాషలో వేరే భాష నుండి వచ్చి కలసిన పదములు అనేకం ఉన్నాయని మనకి తెలుసు. కాని ఆవి ఏవో మనకు చాలా వరకు తెలియదు. అవి తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి, దానికంటే ముందుగా మనకు తెలిసిన తెలుగు పదములను మనము తప్పకుండా గుర్తించాలి. తప్పుగా వ్రాస్తుంటే సరిచేసుకోవాలి. నేను చేస్తున్న ఆ ప్రయత్నంలో నేను నేర్చుకున్న ఈ సూత్రం మీ ముందు ఉంచుతున్నాను.

యకారము, వు, వూ, వొ, వో అనే అక్షరములు తెలుగు పదములకు మొదట లేవు.

        మనం విశ్లేషించుకుంటే ఈ సూత్రం ప్రకారం మనకు కొన్ని విషయాలు బోధపడతాయి. అలాగే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. మొదట మనం అర్ధం చేసుకోవలసినవి చూసుకుంటే 1) మన భాషలో ఈ అక్షరములతో మొదలయ్యే పదములు ఉండవు అని అర్ధం అవుతున్నది. 2) మనకు తెలిసిన చిన్న చిన్న పదములు మనం తప్పుగా వ్రాస్తుంటే సరిదిద్దుకోవచ్చు. ఇక, ఎందుకు ఉండవు అంటే ఎ, ఏ, ఉ, ఊ, ఒ, ఓ అనే అక్షరములతో పదములు మొదలవుతాయని దీని అర్ధం.

ఉదాహరణలు:

ఉత్తరం, ఉడుత, ఊరు; ఊపిరి, ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఏల, ఒక్కటి, ఒంటె, ఓడ, ఓనమాలు

        చివరగా, మన భాషలో చాలా పదములు సంస్కృతము నుండి వచ్చి కలిసాయని మనలో చాలా మందికి విదితమే. 'ఒ' అనే అక్షరము సంస్కృతములో లేదు. అంటే, 'ఒ' తో మొదలయ్యే పదములు చాలా వరకు తెలుగువే అని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఓటు, ఓటరు అనే పదములు మన ఆంగ్ల పరిజ్ఞానంతో ఆ బాష నుండి కలిసాయని మనకు తెలిసినదే.

గమనిక/విజ్ఞప్తి: పైన చర్చించిన విషయములో ఏవైనా  తప్పులుంటే విజ్ఞులు సరిదిద్దగలరు. ఏదైనా జతచెయ్యదలచినా, సదా ఆహ్వానం.

 

31, జనవరి 2014, శుక్రవారం

సున్న రూపాయి కాగితం

                                          (ఈ చిత్రం www.5thpillar.org నుండి సేకరించబడినది)

             మీరు పైన చూస్తున్నది సున్న రూపాయి కాగితం. యాభై రూపాయల కాగితం నమూనాలో ముద్రించబడినది. ఇది సరదాగా ముద్రించినది మాత్రం కాదు. దీని వెనుక ఒక మంచి ఆశయం ఉంది. ఇది 'ఐదవ స్తంబము' అనే లాభాపేక్షలేని సంస్థ  మనదేశంలోని లంచగొండితనాన్ని ఎదురుకోవాలనే సంకల్పంతో 2007 లో మొదలుపెట్టిన కార్యక్రమం. ఈ సంస్థను విజయానంద్ అనే సమాచార సాంకేతిక నిపుణుడు అమెరికా నుండి తిరిగి వచ్చి 2006లో స్థాపించాడు. ఆసక్తిగలవారు మరిన్ని వివరాలు కోసం పైన చిత్రం క్రింద ఇవ్వబడిన చిరునామాని సందర్శించండి.


26, జనవరి 2014, ఆదివారం

జాతీయ 'ఓటర్ల ' దినోత్సవం


              ఈ రోజు దినపత్రిక తిరగవేస్తుంటే ఒక కొత్త విషయం తెలిసింది. అది 'జాతీయ ఓటర్ల దినోత్సవం' ('ఓటర్ ' అనే ఆంగ్ల పదము తెలుగు పదముగా స్థిర పడ్డట్లేనా?) అనేది ఒకటి ఉందనీ, అది జనవరి 25న అని. అంటే, ఏమిటా అని కుతూహలం కొద్ది అంతర్జాలంలో వెతికాను. మన భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం ఏర్పడిన రోజుని (అది జనవరి 25, 1950లో ఏర్పడింది) 2011వ సంవత్సరం నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా పరిగణిస్తున్నదని తెలిసింది. ఇంకా వివరాలలోకి వెళ్ళితే, ఈ రోజున 18 సంవత్సరములు నిండిన యువతకు ఓటరు గుర్తింపు 'కార్డు' లు ('కార్డు' కూడా మన భాషలో కలిసిపోయింది!?) జారి చేస్తారని తెలిసింది. ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం సజావుగా సాగుతుంటే, సంతోషించ దగిన విషయమే.

             అందఱికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
 

26, ఆగస్టు 2010, గురువారం

విశ్వమాత

( చిత్రం స్ట్టాంప్స్ బుక్స్.ఆర్గ్ నుండి సేకరించబడినది)

ఆగష్టు 26, 1910 అల్బేనియాలో జననం. అసలు పేరు ఆగ్నెస్ గోన్షా భుజాక్షువు. గోన్షా అంటే మొగ్గ అని అర్థం. 9 యేట తండ్రి మరణం. 18 యేట సన్యాసినిగా సేవ చేయటానికి నిశ్చయించుకుని తల్లిని, అక్కని, అన్నయ్యని వదిలి ప్రయాణం. జనవరి 6, 1929 భారత దేశం వచ్చింది. 21 యేట సన్యాసినిగా మారి నిర్విరామంగా, నిస్వార్థంగా తుది శ్వాస విడిచే వరకు పేద ప్రజల సేవార్దం తన నిండు జీవితాన్ని వెచ్చించిన మాతృమూర్తి. 1948 సంవత్సరంలో భారత దేశ పౌరసత్వం పొంది, ఆదే యేట ఆగష్టు 16 నుండి నీలం అంచు తెల్లచీర ధరించి, తన కాన్వెంట్ పరిధి నుండి బయటికి వచ్చి ఎందరో అభాగ్యుల జీవితాలలో వెలుగు నింపటానికి నడుం బిగించింది, 1950లో సమాజంలో కూడు, గుడ్డ లేని అభాగ్యులు, వికలాంగులు, నిరాధరణకి గురైన కృష్టు రోగుల కోసం 'మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ' స్థాపన. 1952లో 'నిర్మల్ హృదయ్' స్థాపన. 1955లో అనాధల కోసం 'నిర్మల్ శిషు భవన్ ' స్థాపన. అన్నిటికీ మించి వాటిలో ఆమె నిరంతర, నిస్వార్థ సేవ ఆమె ఔధార్యాన్ని, సేవాగుణాన్ని ప్రపంచానికి చాటింది. అనతి కాలంలొనే అనేక దేశాలకి ఆమె సేవాకార్యక్రమాలు విస్తరించాయి, భారత ప్రభుత్వం తొలిసారిగా 1962లో పద్మశ్రీతొ గుర్తించింది. 1980లో దేశ విశిష్టమైన భారతరత్నతో సత్కరించింది. 1979లో విశిష్టమైన నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. బహుమతితో వచ్చిన నగదు మొత్తాన్ని, దాని ప్రధాననంతరం ఇచ్చే విందుభోజనాన్ని రద్దు చేయించి ఖర్చుతో పేదల పొట్ట నింపిన కరుణామయి. సెప్టెంబరు 5, 1997 తుది శ్వాస విడిచిన ఆమె, తన స్థానాన్ని భర్తి చేసే వారు పుట్టుతూనే వుంటారని వినమ్రంగా భరోసాని ఇచ్చి వెళ్ళింది.