పేజీలు

31, జనవరి 2014, శుక్రవారం

సున్న రూపాయి కాగితం

                                          (ఈ చిత్రం www.5thpillar.org నుండి సేకరించబడినది)

             మీరు పైన చూస్తున్నది సున్న రూపాయి కాగితం. యాభై రూపాయల కాగితం నమూనాలో ముద్రించబడినది. ఇది సరదాగా ముద్రించినది మాత్రం కాదు. దీని వెనుక ఒక మంచి ఆశయం ఉంది. ఇది 'ఐదవ స్తంబము' అనే లాభాపేక్షలేని సంస్థ  మనదేశంలోని లంచగొండితనాన్ని ఎదురుకోవాలనే సంకల్పంతో 2007 లో మొదలుపెట్టిన కార్యక్రమం. ఈ సంస్థను విజయానంద్ అనే సమాచార సాంకేతిక నిపుణుడు అమెరికా నుండి తిరిగి వచ్చి 2006లో స్థాపించాడు. ఆసక్తిగలవారు మరిన్ని వివరాలు కోసం పైన చిత్రం క్రింద ఇవ్వబడిన చిరునామాని సందర్శించండి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి